రాజ్‌తరుణ్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌..లావణ్యకు రూ. 5 కోట్ల బంఫర్‌ ఆఫర్‌?

-

హీరో రాజ్‌తరుణ్‌-లావణ్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఈ కేసు వెనక్కి తీసుకుంటే… తనకు రూ.5 కోట్లు ఇస్తామని కొంత మంది ఆఫర్‌ ఇచ్చినట్లు తెలిపింది లావణ్య. తాజాగా మళ్లీ మీడియా ముందుకు వచ్చింది లావణ్య. ఈ సందర్భంగా లావణ్య కీలక వ్యాఖ్యలు చేశారు. నా న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తానని.. MAA అసోసియేషన్ ను వెళ్ళి కలుస్తానని హెచ్చరించారు. రాజ్‌ తరుణ్‌ కోసం వీలైతే ఆమరణ దీక్షకు కూడా సిధ్ధమని ప్రకటించారు.


నేను మొదటి సారి ఫిర్యాదు చేస్తే.. ఫార్మాట్ లో లేదు అన్నారు. రెండో సారి ఆధారాలు అడిగారు. 170 ఫోటోలు, వీడియోలు ఉన్న ఆధారాలతో ఫిర్యాదు చేశానన్నారు. ఒక FIR కాపీ మాత్రం ఇచ్చారు. ఇప్పటికీ రాజ్ తరుణ్ పై ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదని…కేసు వెనక్కి తీసుకోమని ఎవరెవరో నన్ను బెదిరిస్తున్నారు. నాకు ప్రాణహాని ఉందని తెలిపారు. నాకు నా రాజ్ కావాలి.. రాజ్ తరుణ్ నాకు దక్కకపోతే నేను ప్రాణాలతో ఉండను అని వెల్లడించారు. రాజేష్ అనే వ్యక్తి నాకు మెసేజ్ చేశాడని… తాను ఒక అడ్వకేట్ ను అని.. నీ కేస్ నేను టేకప్ చేస్తాను అని మెసేజ్ పెట్టాడని వెల్లడించింది లావణ్య.

Read more RELATED
Recommended to you

Exit mobile version