గొప్ప మనసు చాటుకున్న మహేశ్ బాబు కుమారుడు గౌతమ్

-

సూపర్ స్టార్​ మహేశ్​ బాబు సినిమాల్లో హీరోయే కాదు.. రియల్​ లైఫ్​లోనూ హీరోనే. ఎందుకంటే ఎంతో మంది చిన్నారుల ప్రాణాలను ఆయన ఫౌండేషన్ కాపాడుతోంది. మహేశ్ బాటలోనే తన భార్య నమ్రత.. పిల్లలు గౌతమ్, సితార నడుస్తున్నారు. నమ్రత కూడా సామాజిక సేవలో తన వంతు పాల్గొంటుంది. ఇక సితార తన ఫస్ట్ సంపాదనను చారిటీకి ఇచ్చేసింది. ఇక ఇప్పుడు గౌతమ్ తన తండ్రి స్థాపించిన ఫౌండేషన్ ద్వారా మరో జీవితాన్ని పొందుతున్న పిల్లలకు అండగా నిలుస్తున్నాడు.

గౌతమ్ ఘట్టమనేని గొప్ప మనసు ఏంటో తెలియజేస్తూ అతడి తల్లి నమ్రత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. గౌతమ్​ హాస్పిటల్​కు వెళ్లి.. హార్ట్ సర్జరీ చేయించుకున్న చిన్నారులను పరామర్శించినట్లు నమ్రత పోస్టులో రాసుకొచ్చింది. అలానే మానసికంగా వాళ్లను సంతోష పెట్టేలా కొన్ని గిఫ్ట్స్ కూడా ఇచ్చినట్లు తెలిపింది. సరదాగా కాసేపు వారితో ముచ్చటించి త్వరగా కోలుకునే ధైర్యాన్ని ఇచ్చినట్లు పేర్కొంది. గౌతమ్​ చాలాసార్లు తన స్కూల్ అయిపోయన తర్వాత ఇలా ఆస్పత్రికి వెళ్లి చిన్నారులతో కాసేపు గడిపి వచ్చేవాడని నమ్రత తన పోస్టులో పేర్కొంది.

ఇక ఈ పోస్టు చూసిన మహేశ్​ అభిమానులు, నెటిజన్లు.. గౌతమ్​ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మహేశ్ లాంటి గొప్ప వ్యక్తికి ఇలాంటి గొప్ప కొడుకే పుడతాడని అంటూ పొగడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version