ఎట్టకేలకు దిగొచ్చాడు.. త్రిషకు సారీ చెప్పిన మన్సూర్ అలీఖాన్

-

కోలీవుడ్ బ్యూటీ త్రిషపై నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై పలు సినిమా ఇండస్ట్రీల పెద్దలు, ఇతర నటులు తీవ్రంగా స్పందిస్తూ త్రిషకు మద్దతు పలుకుతున్నారు. తాను తప్పుగా ఏం మాట్లాడలేదని త్రిషకు క్షమాపణ చెప్పే ఉద్దేశమే లేదని మన్సూర్ అలీఖాన్ ఇటీవల అన్నాడు. అయితే తాజాగా ఈ నటుడు దిగొచ్చి.. ఎట్టకేలకు ఇవాళ త్రిషకు క్షమాపణలు చెప్పాడు. ‘ఐయామ్ సారీ త్రిష.. ఈ చారిత్రక యుద్ధం ముగిసింది. ప్రజలంతా ఎవరి పని వారు చేసుకోండి’ అని చెప్పుకొచ్చాడు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మన్సూర్ అలీఖాన్.. ‘లియో’లో త్రిషతో ఓ సీన్‌ గురించి మాట్లాడుతూ.. గతంలో ఎన్నో సినిమాల్లో రేప్ సీన్లలో నటించిన తాను లియోలో ఆఫర్ వచ్చినప్పుడు అందులో కూడా త్రిషను రేప్ చేసే సీన్ ఉంటుందని అనుకున్నానని.. అలాంటి సీన్ లేకపోవడం బాధగా అనిపించింది అంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడం.. దీనిపై త్రిష ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖండించింది. తన ఫిల్మ్‌కెరీర్‌లో ఇలాంటి వారితో నటించకుండా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పుకొచ్చింది. మరోవైపు ఈ వ్యవహారంపై జాతీయ మహిళా కమిషన్.. తమిళనాడు డీజీపీకి మన్సూర్​పై ఫిర్యాదు చేయడంతో చెన్నై పోలీసులు మన్సూర్​పై పలు సెక్షన్​ల కింద కేసు నమోదు చేసి సమన్లు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version