నా దృష్టిలో హీరో అంటే చిరంజీవీనే : పవన్ కల్యాణ్

-

నా దృష్టిలో హీరో అంటే చిరంజీవీనే అని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి అన్నారు. బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్​కు హాజరైన ఆయన మాట్లాడారు. బ్రో సినిమాలో సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించగా.. పవన్ కీలక పాత్రలో నటించారు. జులై 28న ఈ సినిమా థియేటర్​లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్​లో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ‘స్టార్‌డమ్‌ సాధించిన తర్వాత ‘నువ్వు హీరో అవుతావా?’ అని అన్నయ్య చిరంజీవి నన్ను అడిగారు. ఆ ప్రశ్నకు నాకు భయమేసింది. ఎందుకంటే నా ఊహలో హీరో అంటే చిరంజీవినే. ఎప్పుడూ నన్ను నేను హీరోగా ఊహించుకోలేదు. చిన్న ఉద్యోగం చేసుకుంటూ, పొలంలో పనిచేయాలని ఉండేది. మా వదిన నాలో మార్పు తీసుకొచ్చారు. మనల్ని నమ్మేవారు ఒకరుండాలి.’ అని చెప్పుకొచ్చారు.

‘ఒకే కుటుంబం నుంచి ఇంతమంది హీరోలు వచ్చారంటే చాలామందికి ఇబ్బందిగా ఉండొచ్చు. కానీ, మేమంతా గొడ్డు చాకిరి చేస్తాం. ప్రేక్షకులను అలరించేందుకు నిరంతరం శ్రమిస్తాం. దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన మేమే చేయగలిగినప్పుడు మీరెందుకు చేయలేరు.’ అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version