ఆటోజానీ పట్టలెక్కనుందా…? పూరి,చిరంజీవి మూవీ ఓకే…?

-

టాలీవుడ్ లో చాలా మంది దర్శకులు మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేయడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆయనతో ఒక్క సినిమా చేసినా చాలు అనుకునే వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు చిరంజీవికి ఆ రేంజ్ లో క్రేజ్ ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఆయన సినిమాలు చేస్తున్నారు. రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి మూడో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.

కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు… ఆచార్య అనే టైటిల్ ని చిత్ర యూనిట్ ఓకే చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా తర్వాత చిరంజీవి ఏ సినిమా చేస్తారు అనేది స్పష్టత రావడం లేదు. ఇప్పుడు తాజాగా టాలీవుడ్ లో ఒక వార్త వస్తుంది. ఆయన పూరి జగన్నాథ్ తో తర్వాతి సినిమా చేస్తున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. టాలీవుడ్ లో ఈ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్. అప్పట్లో ఆటోజానీ అంటూ పూరీ చెప్పిన కథ చిరంజీవికి సంగం మాత్రమే నచ్చిందని, సెకండ్‌ పార్ట్‌ నచ్చలేదని చిరునే చెప్పిన విషయం తెలిసిందే. ఆటోజానీ అటకెక్కడంతో ఖైదీ నెం.150 సీన్‌లోకొచ్చింది. మరి ఇప్పుడు పూరీ చెప్పింది ఆటోజానీ కథనేనా లేక కొత్తదేమైన రాసుకొచ్చాడా తేలాల్సిఉంది.

ఈ సినిమా కోసం పూరి కథ రెడీ చేయగా చిరంజీవి వీడియో కాల్ ద్వారా కథ విన్నారని దీనికి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారని సమాచారం. ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాను మాఫియా ఆధారంగా తీసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కథ పూర్తిగా రెడీ అయిందని రామ్ చరణ్ కూడా కథ విన్న తర్వాత ఫైనల్ చేసే సూచనలు ఉన్నాయని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version