యంగ్ టైగ‌ర్‌తో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వ‌బోతున్న శ్రీ‌దేవీ కూతురు!

-

సీనియ‌ర్ హీరోయిన్ శ్రీ దేవీ కూతురు జాన్వీ క‌పూర్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంటుంది. జాన్వీ క‌పూర్ న‌టించిన సినిమాలు అన్నీ కూడా దాదాపు హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. దీంతో జాన్వీ క‌పూర్ బాలీవుడ్ అగ్ర క‌థా నాయ‌కల స‌ర‌స‌న చేరుతుంది. కాగ ఇప్పుడు జాన్వీ క‌పూర్ సౌత్ వైపు క‌న్నేసిన‌ట్టు తెలుస్తుంది. సౌత్ లో ఎద‌గాలంటే.. తెలుగు ప్రేక్షకుల మెప్పు అవ‌స‌రం అని జాన్వీ క‌పూర్ భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది.

అందు కోసమే టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వాల‌ని ఫిక్స్ అయింద‌ట‌. టాలీవుడ్ లో త‌న మొద‌టి సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ కూడా ఇచ్చిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా అయిన త‌ర్వాత డైరెక్ట‌ర్ బుచ్చిబాబు తో సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. కాగ ఈ సినిమాను బుచ్చిబాబు పాన్ ఇండియా రెంజ్ లో తెర‌కెక్కించాల‌ని ప్లాన్ చేస్తున్నాడు. కాగ పాన్ ఇండియా రెంజ్ సినిమా కాబ‌ట్టి.. బాలీవుడ్ హీరోయిన్ ఎంపిక చేయాల‌ని నిర్మాత‌లు భావించార‌ని తెలుస్తుంది.

దీంతో ప్ర‌స్తుతం బాలీవుడ్ లో దూసుకుపోతున్న జాన్వీ కపూర్ పేరును నిర్మాత‌లు పరిశీలించార‌ని తెలుస్తుంది. జాన్వీ క‌పూర్ కుథ వినిపించ‌గానే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. కాగ దీని పై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌ట‌క‌న వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది. కాగ గ‌తంలో కూడా ఎన్టీఆర్ – జాన్వీ క‌పూర్ జంటగా సినిమా రాబోతుంద‌ని వార్తలు వ‌చ్చాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version