టాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ కు పెను ప్రమాదం!

-

నాచురల్ స్టార్ నాని “సరిపోదా శనివారం” హీరోయిన్ ప్రియాంక మోహన్ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడింది. అసలు విషయం ఏంటంటే.. ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అకస్మాత్తుగా ప్రమాదం సంభవించింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హీరోయిన్ ప్రియాంక మోహన్, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి విచ్చేశారు.

హీరోయిన్ చేతుల మీదుగా షోరూం ని ప్రారంభించారు. అనంతరం స్టేజ్ పై ప్రజలతో మాట్లాడే కార్యక్రమం నిర్వహించారు. అయితే వీరిని చూసేందుకు వేదికపైకి ఎక్కువమంది ఎక్కడంతో ఒక్కసారిగా స్టేజి కుప్పకూలింది. దీంతో స్టేజిపై ఉన్న వారంతా కింద పడిపోయారు. ఒకరిపై ఒకరు పడిపోవడంతో పలువురికి గాయాలయ్యాయి.

ఈ ప్రమాదంలో గాయపడ్డ పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డి ని ఆసుపత్రికి తరలించారు. హీరోయిన్ ప్రియాంక కింద పడిపోయినప్పటికీ ఎటువంటి గాయాలు కాలేదు. దీంతో ఆమెను వెంటనే షాపింగ్ మాల్ లోపలికి తీసుకువెళ్లారు నిర్వాహకులు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version