కరీంనగర్ : సింగరేణి ఓసీపీ -5 పనులపై హై కోర్టు స్టే

-

రామగుండం సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ -5 నిర్మాణ పనులపై హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు జస్టిస్ అభిషేక్ రెడ్డి ధర్మాసనం ఈనెల 30 వరకు ఉత్తర్వులు ఇచ్చింది. తమ భూములను చట్ట విరుద్ధంగా స్వాధీనం చేసుకుంటున్నారని జనగామ భూలక్ష్మి, మహేందర్, రాజేశ్వరితో పాటు 11 మంది హైకోర్టును ఆశ్రయించారు. భూముల్లో రోడ్లు, విద్యుత్ స్తంభాలు వేస్తున్నారని, న్యాయం చేయాలని లాయర్ రచన రెడ్డి ద్వారా హై కోర్టును ఆశ్రయించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version