నేడు మెదక్‌లో మంత్రి హరీష్ రావు పర్యటన

-

జిల్లా కేంద్రమైన మెదక్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి హరీశ్‌రావు పాల్గొననున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు పట్టణంలోని పిల్లికోటల్‌ వద్ద గిరిజన సంక్షేమ పాఠశాల భవనానికి భూమి పూజ చేయనున్నారు. అనంతరం పట్టణంలో వెల్‌కమ్‌ బోర్డు వద్ద ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ప్రారంభించి, మార్కెట్‌ కమిటీ వెనకవైపు నిర్మించబోయే అధునాతన దోబీ ఘాట్‌కు భూమి పూజ చేస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version