పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య

-

వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. మండలంలోని బాలు నాయక్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని శివరాం తండాకు చెందిన బానోతు మంజుల పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. తన అల్లుడు భరత్ తన కుమార్తెను చంపాడని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితుడు భరత్ పరారీలో ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version