ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌ను అందుకే తీసుకోలేదు.. ద్రవిడ్ క్లారిటీ

-

అఫ్గానిస్థాన్‌తో T20 సిరీస్‌కు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌ లను క్రమశిక్షణారాహిత్యం కారణంగానే ఎంపిక చేయలేదన్న వార్తలు మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అయితే ఈ వార్తలలో వాస్తవం లేదని భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. సౌత్ ఆఫ్రికా పర్యటనలో మానసిక అలసట కారణంగా ఇషాన్ కిషన్ విరామం కోరాడని, దానికి జట్టు యజమాన్యము అంగీకరించిందని రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. సెలక్షన్ కి ఇంకా ఇషాన్ కిషన్ అందుబాటులోకి రాలేదని, అతడు సిద్ధంగా ఉన్నప్పుడు దేశవాళీ క్రికెట్‌కు తిరిగి వస్తాడని ద్రావిడ్ వెల్లడించారు.

 

క్రమశిక్షణ చర్య ల కారణంగా శ్రేయస్ అయ్యర్‌ జట్టుకు దూరం కాలేదని జట్టులో ఉన్న పోటీ కారణంగానే అతడిని ఎంపిక చేయలేకపోయామని ద్రవిడ్ తెలిపాడు.. పరిమిత స్థానాల కోసం చాలా మంది బ్యాటర్లు పోటీ పడుతుండడంతో శ్రేయస్ అయ్యర్ ని పక్కనపెట్టాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. సౌత్ ఆఫ్రికా తో జరిగిన T20 సిరీస్‌లోనూ అయ్యర్ కు చోటు దక్కలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version