మేడ్చల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. వివాహిత దుర్మరణం

-

మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీని లారీ ఢీకొనడంతో దంపతులు ఇద్దరు కింద పడిపోగా..వివాహిత మృతి చెందింది. ఈ ఘటన బుధవారం తెల్లవారు జామున మేడ్చల్ జిల్లా పరిధిలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. మేడ్చల్ పట్టణానికి చెందిన రత్నం, మాధవరావు భార్యభర్తలు. బుధవారం ఉదయం ఇద్దరూ కలిసి హీరో హోండా యాక్టివా స్కూటీపై వెళ్తున్నారు.

ఈ క్రమంలోనే మేడ్చల్ పోలీస్ స్టేషన్ సమీపంలో వారి వాహనాన్ని రెడీమిక్స్ కాంక్రీట్ లారీ వెనుక నుంచి వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో భార్య రత్నం(55) లారీ టైర్ల కిందపడి ప్రాణాలు కోల్పోగా, భర్త మాధవరావుకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు మాధవరావును చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version