టీడీపీకి షాక్.. రాయపాటి రంగారావు రాజీనామా

-

ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి మరో షాకు తగిలింది. ఇటీవల చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ విజయవాడ ఎంపీ కేశినేని నాని రాజీనమా చేశారు. గుంటూరు సీనియర్ నేత రాయపాటి రంగారావు జనవరి 12వ తేదీ శుక్రవారం టీడీపీకి రాజీనామా చేశారు. ఈమేరకు ఆయన తన రాజీనామా లేఖను టీడీపి అధినేత చంద్రబాబుకు పంపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను పార్టీలో ఇమడలేనని… తన రాజీమానా లేఖను ఆమెదించాలని లేఖలో పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులు.. ఆఫీసులో ఉన్న చంద్రబాబు నాయుడు ఫోటోను నేలకేసి పగలగొట్టిన వీడియో ప్రస్తుతం నెట్టింట్ల వైరల్ అవుతోంది.

 

నరసరావుపేట లోక్ సభ స్థానాన్ని కూడా టీడీపీ బీసీలకు కేటాయించాలని నిర్ణయించినట్లు తెలియడంతో రాయపాటి రంగారావు కుటుంబం.. చంద్రబాబుపై ఆవేదన వ్యక్తం చేస్తూ సైకిల్ దిగుతున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version