నన్ను నేనే నమ్మకలేకపోయా – కర్ణాటక శిల్పి యోగి రాజ్

-

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అయోధ్యలో ఘనంగా జరిగింది. వేలాది మంది రాజకీయ, సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కాగా.. కోట్లాది మంది భారతీయులు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక ప్రసారాల ద్వారా వీక్షించారు. 500 ఏళ్ల నాటి కల నెరవేరడంతో ఇండియా మొత్తం జైశ్రీరామ్ నినాదంతో మార్మోగిపోయింది.

ఇదిలా ఉండగా….ఈ కార్యక్రమం తర్వాత విగ్రహాన్ని చెక్కిన శిల్పి యోగి రాజ్ బాల రాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్ట తర్వాత నేను చిక్కిన శిల్పం మారిపోయిందని,అసలు నేను చేసిన విగ్రహమేనా అనే సందేహం వచ్చింది అని ఆయన అన్నారు. ప్రతిష్టాపన తర్వాత బాల రాముని ముఖంలో చిరునవ్వు, కళ్ళలో భావాలు మారిపోయాయి అని శిల్పి యోగిరాజ్ తెలిపారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version