ప్రజలు ఇచ్చిన దెబ్బకి జగన్ కు మైండ్ పోయింది : బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి

-

జగన్ ఢిల్లీకి డ్రామాలు ఆడేందుకు వెళ్లినట్టు ఉందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.మీరు మీరు కొట్టుకుని, చంపుకొని కూటమి పై మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.ఎవరు ఎక్కడ చనిపోయారు పేర్లను 24 గంటల్లో చెప్పు జగన్ అని సవాల్ చేశారు.

ప్రజలు ఇచ్చిన దెబ్బకి జగన్ కు మైండ్ పోయిందని మండిపడ్డారు .ఇక జగన్ ను డ్రామాల రెడ్డిగా పిలుస్తామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అన్నారు. విధ్వంస పాలనను ఇచ్చింది నువ్వే, రాష్ట్రాన్ని నాశనం చేసావని ఆయన జగన్‌పై ఫైర్ అయ్యారు. శాంతి భద్రతలు లేని అంధప్రదేశ్ గా మార్చేశావని..దెయ్యాలు వేదాలు వళ్లించినట్టు ఉంది నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉంటే అని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నీ పై నమ్మకం లేక ప్రజలు నీ పాలన వద్దని ఇంటి కి పంపారని ఆయన అన్నారు. లిక్కర్ గోల్ మాల్ 99వేల కోట్ల నగదు.. 620 కోట్లు డిజిటల్ మార్పు జరిగిందని ఆయన నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version