మాకు కాంగ్రెస్ వొద్దు..

-

 నల్లగొండ జిల్లా దామరచర్లలో వద్ద నిర్మించనున్న4 వేల మెగావాట్ల అల్ట్రా పవర్‌ ప్లాంటును  అడ్డుకుంటానని కాంగ్రెస్ నేత కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొనడంపై జిల్లా వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మాట్లాడుతూ… తెలంగాణను చీకటి రాజ్యంగా మార్చేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నాగార్జున సాగర్ ఇదే జిల్లాలో ఉన్నప్పటికీ మాకు ఫోరైడ్ సమస్య తీరలేదు.. ఇప్పుడేమో తెరాస అధినేత కేసీఆర్ జిల్లా ప్రయోజనాలను ఉద్దేశించి నిర్మించనున్న పవర్ ప్లాంటును అడ్డుకుంటామని ప్రకటనలు చేయడం దారుణంమన్నారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయ న విలేకరులతో మాట్లాడుతూ ప్రజల ప్రాణా లను పణంగా పెట్టి ప్రాజెక్టులు కట్టి తెరాస నేతలు కోట్లాది రూపాయలను దోచుకుంటున్నరని విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version