మెగాస్టార్ చిరంజీవిని కలిసిన త్రివిక్రమ్

-

రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే.మెగాస్టార్ చిరంజీవికి భారతదేశ రెండో అత్యున్నత అవార్డు పద్మవిభూషణ్ ప్రకటించింది. ఒక కానిస్టేబుల్ కొడుకుగా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి సొంతంగా కష్టపడి 150కి పైగా సినిమాలలో నటించాడు. అంతేకాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజలకు సహాయము అందించాడు. పద్మ విభీషణ్ అవార్డు రావడంతో చిరంజీవికి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా….మెగాస్టార్ చిరంజీవిని డైరెక్టర్ త్రివిక్రమ్, నిర్మాత ఎస్.రాధాకృష్ణ కలిశారు. పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, హీరో కిరణ్ అబ్బవరం,సందీప్ రెడ్డి వంగా, కొరియోగ్రాఫర్ జానీ తదితరులు ఆయనను కలిశారు. నిర్మాతలు దిల్రాజు, శిరీశ్ కలిసి వెళ్లి శిరీశ్ కుమారుడు సినీహీరో ఆశిష్ వివాహానికి రావాల్సిందిగా మెగాస్టార్ను ఆహ్వానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version