వైసీపీకి అబద్ధాలు ఆడటం వెన్నతో పెట్టిన విద్య :మంత్రి గుమ్మడి సంధ్యారాణి

-

వైఎస్ జగన్‌పై మంత్రి గుమ్మడి సంధ్యారాణి నిప్పులు చెరిగారు. జగన్ మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విమర్శించారు.రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలకు వైసీపీ నేతలే ఆద్యులని ఆమె ఆరోపించారు. దెబ్బలు, కొట్లాటలతో అల్లకల్లోల వాతావరణం సృష్టించారని ఫైర్ అయ్యారు.అలాంటి నేతలు ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందని,అబద్ధాలు ఆడటం వారికి వెన్నతో పెట్టిన విద్య అని మండిపడ్డారు. దమ్ముంటే జగన్ రెడ్డి తన బాబాయి వైఎస్ వివేకా హత్యపై ఢిల్లీలో ధర్నా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

వైసీపీ నేతలు నిజంగానే ప్రజాస్వామ్యం కోరే నాయకులైతే.. ముందుగా వివేకా హత్యపై సీబీఐ ఎంక్వైరీ కోరాలని పేర్కొన్నారు. డ్రైవర్‌ను చంపి డోర్ డెలివరి చేసిన ఓ హంతకుడు.. ప్లకార్డులు పట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. తాము కక్షపూరితంగా వెళ్లాలంటే.. తమ నాయకుడు కనుసైగ చేస్తే చాలని, తమ కార్యకర్తలే వారికి బుద్ధి చెప్తారని వార్నింగ్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version