అదుపుతప్పి చెరువులో పడిన ట్రాక్టర్.. 10 మంది దుర్మరణం

-

ఉత్తర్​ప్రదేశ్​లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ట్రాక్టర్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెరువులో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది చనిపోయారు. మరో 37 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం సమయంలో ట్రాక్టర్ లో 47 మంది ప్రయాణిస్తున్నారు. గమనించిన స్థానికులు వెంటనే వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో ట్రాక్టర్ కింద ఇరుక్కున వారిని బయటకు తీశారు.

లఖ్​నవూ జిల్లా అసన్హా ప్రాంతంలో సోమవారం ఈ ఘటన జరిగింది. ఓ చిన్నారికి పుట్టువెంట్రుకలు తీయించేందుకు 47 మంది కలిసి ట్రాక్టర్​లో గుడికి బయలుదేరారు. మార్గమధ్యంలో ట్రాక్టర్​ అదుపు తప్పి, రోడ్డు పక్కనున్న చెరువులో పడిపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఎనిమిది మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు వెల్లడించారు. మిగిలిన వారిని స్థానికులు రక్షించారు. గాయపడ్డ వారిని మందిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల పరిహారం ప్రకటించింది ప్రభుత్వం. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version