ఏపీలో నేడు కొత్త‌గా 2 క‌రోనా కేసులు.. 50 లోపే యాక్టివ్ కేసులు

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య మ‌ళ్లీ త‌గ్గుముఖం ప‌డుతుంది. గ‌త కొద్ది రోజుల క్రితం ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఒక్క క‌రోనా కేసు నుంచి 8 కేసుల వ‌ర‌కు పెరిగాయి. వ‌రుస‌గా రెండు రోజులు 8 క‌రోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. కాగ ప్ర‌స్తుతం కేసుల సంఖ్య మ‌ళ్లీ త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. ఈ రోజు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కాసేప‌టి క్రితం క‌రోనా వైర‌స్ బులిటెన్ ను విడుద‌ల చేశారు.

ఈ క‌రోనా బులిటెన్ ప్ర‌కారం.. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.. 1,988 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించారు. ఈ పరీక్షల‌ల్లో కేవ‌లం 2 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు మాత్ర‌మే న‌మోదు అయ్యాయి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 16 మంది క‌రోనా వైర‌స్ బాధితులు పూర్తి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో 50 లోపే యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్ర‌స్తుతం 43 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఈ రోజు కూడా క‌రోనా మ‌ర‌ణాలు న‌మోదు కాలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version