గవర్నమెంట్ స్కూల్స్ కు కొత్త రూల్… టీచర్లకు 20 వేల ట్యాబ్ లు !

-

తెలంగాణ ప్రభుత్వంలో ప్రజల అభివృద్ధి కోసం వివిధ మార్పులు చేస్తున్నాయి. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్య సంవత్సరం నుండి కీలక మార్పులు తీసుకు రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ మరియు ప్రయివేట్ కార్యాలయాల్లో అవలంభిస్తున్న ఆర్టిఫికల్ ఇంటెలిజెన్స్ ఫ్యాష అటెండన్స్ పద్దతిని పిల్లలకు కూడా ఆచరణలోకి పెట్టడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ పద్ధతి కోసం రాష్ట్రంలో ఉన్న టీచర్ లకు 20 వేల ట్యాబ్ లను ప్రభుత్వమును ఇవ్వనుంది. ఈ ట్యాబ్ ల ద్వారా సాఫ్ట్ వెర్ ఇంస్టాల్ చేసి పిల్లలు అటెండన్స్ ను మెయింటెయిన్ చేయనున్నారు.

అయితే పిల్లలతో పాటుగా టీచర్ లకు కూడా ఈ విధానం అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ట్యాబ్ లను ఇచ్చే ముందు టెక్నికల్ గా వారికి ట్రైనింగ్ ఇవ్వనున్నారు. వీలైనంత త్వరలో ఈ ట్యాబ్ లు అందుబాటులోకి వస్తాయని కేటీఆర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version