కారు గ్లాస్ పగలకొట్టడానికి సెంట్ బాటిల్ వాడినా, 3 గంటలు నరకం చూసిన చిన్నారులు

-

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లె గ్రామంలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. కారులోకి ఆడుకోవడానికి వెళ్ళిన ముగ్గురు చిన్నారులు మరణించిన తీరు అందరిని కన్నీరు పెట్టిస్తుంది. మోహన్ ఫిన్ టెక్స్ అనే సంస్థ వద్ద ఈ సంఘటన జరిగింది. ఆడుకోవడానికి గానూ కారులోకి వెళ్ళగా కారు డోర్ లాక్ పడింది. దీనితో వారు బయటకు రావడానికి నానా ప్రయత్నాలు చేసారు.

అయినా సరే వారు బయటకు రాలేదు. చివరికి ఎలా బయటకు రావాలో అర్ధం కాక కారులో ఉన్న సెంట్ బాటిల్ తో ఫ్రంట్ డోర్ పగలకొట్టే ప్రయత్నం చేసారు. అయినా సరే కారు డోర్ గాని గ్లాస్ గాని ఏది రాలేదు. వారు అరిచినా సరే మూడు గంటల పాటు వారి అరుపులు ఎవరికి వినపడలేదు. చివరికి మూడు గంటల పాటు కారులో గాలి ఆడక ప్రాణాలు కోల్పోయారు ఆ ముగ్గురు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version