బ్రేకింగ్: విజయవాడ ప్రమాద మృతులకు 50 లక్షలు; సిఎం జగన్

-

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లోని కోవిడ్ కేర్ సెంటర్ లో జరిగిన అగ్ని ప్రమాద మృతులకు ఏపీ సిఎం వైఎస్ జగన్ 50 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు. ఈ ఘటనపై ఆరా తీసిన జగన్ గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలి అని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. గాయపడిన వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని, ప్రమాద ఘటనపై హోం మంత్రి నివేదిక ఇవ్వాలని సిఎం ఆదేశాలు ఇచ్చారు.

అగ్ని ప్రమాదం ఘటనకు గల కారణాలను తెలుసుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. కాగా ఈ ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరి కొంత మరణించే అవకాశం ఉంది అని అధికారులు చెప్తున్నారు. పలువురు గాయపడ్డారు. మొత్తం ఈ హోటల్ కోవిడ్ కేర్ సెంటర్ లో 50 మంది వరకు కరోనా బాధితులు ఉన్నారు అని అధికారులు మీడియాకు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version