తెలంగాణలో నేడు 75 క‌రోనా కేసులు.. జీరో మ‌ర‌ణాలు

-

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కేసులు సంఖ్య క్ర‌మంగా త‌గ్గుతుంది. గ‌త కొద్ది రోజుల నుంచి రాష్ట్రంలో వంద లోపే క‌రోనా కేసులు న‌మోదు అవుతున్నాయి. అలాగే మ‌ర‌ణాలు కూడా సంభవించ‌డం లేదు. కాగ నేటి క‌రోనా బులిటెన్ ను తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుద‌ల చేశారు. ఈ కరోనా బులిటెన్ ప్ర‌కారం.. రాష్ట్ర వ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల్లో 75 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు వెల‌గు చూశాయి. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వర‌కు వ‌చ్చిన క‌రోనా కేసుల సంఖ్య 7,90,574 కు చేరింది.

కాగ నేడు రాష్ట్రంలో 82 మంది బాధితులు కరోనా వైర‌స్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 7,85,647 కు చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో క‌రోనా యాక్టివ్ కేసులు 816 గా ఉన్నాయి. కాగ ఈ రోజు కూడా రాష్ట్రంలో క‌రోనా మ‌ర‌ణాలు సంభ‌వించ‌లేదు. దీంతో రాష్ట్రంల ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదు అయిన క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,111 గానే ఉంది. కాగ నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు 23,861 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version