విజృంభించిన జడేజా…. ఆల్ అవుట్ అయిన ఇంగ్లాండ్

-

ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా రాంచీ వేదికగా ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 353 పరుగులకు ఆలౌటైంది.302/7తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ 51 రన్స్ చేసింది. రెండో రోజు తొలి సెషన్లో ఆల్రౌండర్ జడేజా విజృంభించారు. ఒకే ఓవర్లో జడేజా రెండు వికెట్లు తీశాడు. 102 వ ఓవర్లో మొదటి బంతికి రాబిన్సన్ను ఔట్ చేయగా నాలుగో బంతికి బషీర్ ను ఔట్ చేశాడు. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన జేమ్స్ అండర్సన్ ను కూడా అవుట్ చేసి రెండో రోజు మూడు వికెట్లను జడేజానే తీశాడు.

ఓవర్ నైట్ బ్యాటర్ రాబిన్సన్ (58), బషీర్ (0), అండర్సన్(0)ను వెంట వెంటనే పెవిలియన్ బాట పట్టారు. ఇంగ్లాండ్ బ్యాటర్లలో రూట్ 122*, రాబిన్సన్ 58, బెన్ ఫోక్స్ 47, జాక్ క్రాలే 42, బెయిర్ స్టో 38 రన్స్ చేశారు. భారత బౌలర్లలో జడేజా 4, ఆకాశ్ 3, సిరాజ్ 2 వికెట్లు తీయగా అశ్విన్ ఒక వికెట్ తీశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version