యువతిపై లైంగిక దాడి, ఆ తర్వాత రెడ్ లైట్ ఏరియాలో!

-

బెంగళూరులో యువతి గ్యాంగ్ రేప్ గురైన ఘటన ఆలస్యంగా బయటపడింది. మూడేళ్ల క్రితం మాండ్య కు చెందిన యువతిని ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి, ఆమె ప్రియుడు నగరానికి తీసుకువచ్చాడు. ఆమెను ఒక గదిలో ఉంచి ప్రియుడు, ఆపై మరికొందరు ఒకేసారి ఆమెపై ఘోరానికి పాల్పడ్డారు. శివానంద సర్కిల్ వద్ద గల ఒక లాడ్జి యజమాని సంతోష్ కూడా ఇందులో ఉన్నాడు.

తర్వాత యువతిని వ్యభిచారం ముఠాకు విక్రయించారు. ఇటీవల పోలీసులు ఒక లాడ్జిలో జరుగుతున్న పడుపు దందాపై దాడి చేయగా పట్టుబడిన ఈ యువతి దీనగాధను వివరించింది. ఈ ఘటనపై హై గ్రౌండ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాగా, మంజుల, బ్రహ్మేంద్ర, సంతోష్ కుమార్ లను శనివారం అరెస్టు చేశారు. అలాగే మోసపోయిన యువతి స్టేట్ మెంట్ ను రికార్డు చేసిన అనంతరం గ్యాంగ్ రేపు పై మరో కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version