భర్త తలపై మూత్రం పోసి, గుండు గీయించి చితకబాదిన భార్య ప్రియుడు

-

భార్య అక్రమ సంబధం..భర్త పరువు పోయే స్థితికి తెచ్చింది. అక్రమ సంబంధం గురించి.. నిలదీస్తే, భర్తను గుండు గీయించి.. మూత్రం పోశారు అతని భార్య, ప్రియుడు. ఈ దారుణమైన సంఘటన తిరుపతిలోని చంద్రగిరిలో చోటు చేసుకుంది. అయితే, ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ సంఘటన వివరాల్లోకి వెళితే, తన భార్య అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం తెలుసుకున్న భర్త… ఆమె ప్రియుడు మరణించినట్లు సోషల్ మీడియాలో RIP అని పోస్టింగ్స్ పెట్టించాడు. అయితే, ఆ పోస్టులు పెట్టినందుకు.. బెంగుళూరులో ఉన్న భర్తను కిడ్నాప్ చేశారు భార్య ప్రియుడు, అతని స్నేహితుడు.

అనంతరం… చంద్రగిరిలో భర్త తలపై మూత్రం పోసి, గుండు గీయించి, చితక బాదారు భార్య ప్రియుడు అతని స్నేహితుడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు… విచారణ చేపట్టారు పోలీసులు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version