పది రోజుల్లో కొత్త పార్టీ ప్రకటిస్తా – గులాం నబీ ఆజాద్

-

కాంగ్రెస్ పార్టీతో ఐదు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్న సీనియర్ రాజకీయ వేత్త గులాం నబీ ఆజాద్ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. తన రాజీనామాతో కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చిన జమ్ము కాశ్మీర్ నేత గులాంనబి ఆజాద్ కొత్త పార్టీ పై పది రోజులలో ప్రకటన చేస్తానని అన్నారు. జమ్ములో బహిరంగ సభను తలపెట్టిన ఆజాద్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..

 

కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనకు మద్దతు ఇచ్చేవారు ఎన్నో రెట్లు పెరిగినట్టు ప్రకటించారు. జమ్మూలో 30 నుంచి 35 అసెంబ్లీ నియోజకవర్గలా పరిధిలో 400 మందిని కలుసుకున్నట్టు చెప్పారు. వారంతా తనకు మద్దతు తెలిపారని, ఏ పార్టీ అయినా తనతో నడుస్తానని చెప్పినట్టు పేర్కొన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ఆజాద్ కు మంచి మద్దతు లభిస్తున్న క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version