బ్రేకింగ్‌ : నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు యువకులు మృతి

-

బ్రేకింగ్‌ : నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై కట్టంగూరు శివారులో ఎరసాని గూడెం వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే… ఈ సంఘటనలో ముగ్గురు యువకులు అక్కడిక్కడే మృతి చెందగా, మరో నలుగురికి గాయాలు అయ్యాయి.

దీంతో క్షత గాత్రులను నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు స్థానికులు. మృతులు ఎండి ఇద్దాక్ (21) ఎస్ కే.సమీర్ (21) ఎస్ కే.యాసీన్ (18) వీరంతా ఖమ్మం వాసులుగా గుర్తించారు పోలీసులు. హైదరాబాదు నుండి ఖమ్మం వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. హైదరాబాదులో వలీమా ఫంక్షన్ కు హాజరై తిరిగి వెళుతుండగా తెల్లవారుజామున ఇన్నోవా కారు బోల్తా పడిందని స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version