నారా లోకేష్ కు తప్పిన పెను ప్రమాదం..

-

ఆకివీడు మండలం సిద్ధాపురం వద్ద లోకేష్ కు పెను ప్రమాదం తప్పింది. ఆయన నడుపుతున్న ట్రాక్టర్ అదుపు తప్పి ఉప్పుటేరు కాల్వలోకి వెళ్ళి పోయింది. వెంటనే ట్రాక్టర్ ను అదుపుచేసి, లోకేష్ ను ట్రాక్టర్ నుంచి దింపేశారు ఉండి ఎమ్మెల్యే రామరాజు. ఆకివీడు మండలం సిద్ధాపురం వద్ద వరదల వలన పాడైన చేపలను లోకేష్ పరిశీలించారు.

అనంతరం మత్స్యకారులతో మాటా మంతి చేశారు. అయితే ఈ సమయంలో ఆయన ట్రాక్టర్ నడపడంతో పెనుప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి లోకేష్ వరదల వలన నష్టపోయిన రైతులను పరామర్శిస్తున్నారు. అంతే కాక ఆయన పంట పొలాలను కూడా పరిశీలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version