ట్రెండ్ ఇన్: ‘ఆచార్యుడి’ హంగామా మొదలు..థియేటర్లు ఇక దద్దరిల్లాల్సిందే

-

సెల్ఫ్ మేడ్ మ్యాన్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతో ఆత్రుగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 29న చిత్రం విడుదల కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు బిజినెస్ కూడా బాగానే జరిగినట్లు తెలుస్తోంది.

చిత్ర సీమ ప్రముఖులు, దర్శక నిర్మాతలు ఈవెంట్ కు హాజరయ్యారు. యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ జనంతో కిక్కిరిసిసోయింది. ఇక ఈ ఈవెంట్ లో మెగాస్టార్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కూతురు, అల్లుడు, కోడలు తదితరులు హాజరయ్యారు.రామ్ చరణ్, చిరంజీవి, కొరటాల శివ, RRR దర్శకులు ఎస్.ఎస్.రాజమౌళి మాటలు విన్న అభిమానులు సినిమా డెఫినెట్ గా హిట్ అవుతుందని సంబురాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే మెగా అభిమానులు #AcharyaPreReleaseEvent ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ హ్యాష్ ట్యాగ్ , #Acharya హ్యాష్ ట్యాగ్ ఆచార్యలను ట్వీట్ చేస్తున్నారు. వాళ్ల వరుస ట్వీట్స్ తో సదరు హ్యాష్ ట్యాగ్స్ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో ఎంటర్ టైన్మెంట్ కేటగిరిలో ట్రెండింగ్ లోకి వచ్చేశాయి.

ఈ నెల 29న విడుదల కానున్న సినిమా కోసం సినీ పరిశ్రమ ప్రముఖులతో పాటు సినీ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తండ్రీ తనయులు చిరంజీవి-రామ్ చరణ్ ల కలయికలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ గా రామ్ చరణ్ నటించిన చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ పిక్చర్ డెఫినెట్ గా రికార్డులన్నిటినీ తిరగరాస్తుందని మెగా అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

https://twitter.com/search?q=%23Acharya&src=trend_click&vertical=trends

Read more RELATED
Recommended to you

Exit mobile version