ఫ్యాన్స్ పై లాఠీ ఛార్జ్..స్పందించిన అల్లు అర్జున్ …!

-

హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ వద్ద గత రాత్రి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అల్లు అర్జున్ తో ఫోటోలు దిగేందుకు పెద్ద ఎత్తున అభిమానులు అక్కడకు చేరుకున్నారు. కానీ ఎంతసేపటికీ గేట్లు తెరవకపోవడం తో గేట్లను బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు. దాంతో పోలీసులు అభిమానులపై లాఠీ ఛార్జ్ చేశారు. ఈ క్రమంలో కొందరు అభిమానులు గాయపడినట్టు తెలుస్తోంది. ఇక అభిమానులు గాయపడటం పై బన్నీ స్పందించారు. ఈవెంట్ లో జరిగిన ఘటన దురదృష్టకరం అని అన్నారు.

దురదృష్టవశాత్తు నా అభిమానులు గాయపడినట్టు తెలిసింది. మా బృందం అక్కడ పరిస్థితిని పర్యవేక్షిస్తూ సమాచారం ఎప్పటికప్పుడు నాకు చేరవేస్తుంది. ఇలాంటి ఘటనలు భవిష్యత్ లో జరగకుండా చూస్తానని హామీ ఇస్తున్నా మీ ప్రేమ అభిమానం నాకు అతిపెద్ద ఆస్తులు..అంటూ బన్నీ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా ఈ నెల 17న విడుదల కానుంది. దాంతో పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version