గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీస్తున్నారు. దీంతో సొంత నియోజకవర్గాలకు వెళ్లేందుకు ఎమ్మెల్యేలు జంకుతున్నారు. తాజాగా హామీలు అమలు కావడం లేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేను ప్రజలు ఉరికించారు.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండలంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజును హామీలపై ప్రజలు నిలదీశారు. ఆరు గ్యారంటీలంటూ మోసం చేశారని, హామీలు అమలు చేయకుంటే ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు బుద్ది చెప్తామంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఈ ఘటన చోటుచేసుకోగా.. ప్రజలు చుట్టుముట్టడంతో వారికి సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే నాగరాజు మధ్యలోనే వెళ్లిపోయారు.