ఫలక్‌నుమా దాస్ ఛాలెంజ్ స్వీక‌రించిన అల్లు శిరీష్‌.!

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనికి మంచి స్పందనే వచ్చింది. ఇప్పటికే ఎంతో మంది సినీ తారలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు చాలా మంది ఈ ఛాలెంజ్‌ ను స్వీకరించారు. తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా ఈ ఛాలెంజ్‌ని తాజాగా అల్లు శిరీష్ స్వీక‌రించారు. విశ్వ‌క్ సేన్ ఇచ్చిన ఛాలెంజ్‌ని స్వీక‌రించిన శిరీష్ త‌న పెర‌డులో మూడు మొక్కలు నాటి వాటికి నీళ్ళు ప‌ట్టారు.

ఈ ఛాలెంజ్‌ని త‌న మేన‌ల్లుడు, మేన‌కోడ‌ళ్ళకి విసిరారు. నేటి బాల‌లే రేప‌టి పౌరులు కాబ‌ట్టి ఈ ఛాలెంజ్‌ని వారికి విసిరాన‌ని శిరీష్ తెలిపారు. అలాగే వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి కోసం చేపట్టిన కార్యక్రమంలో త‌న‌ని భాగ‌స్వామ్యం చేసినందుకు ఎంపీ సంతోష్ కుమార్‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు శిరీష్‌. అల్లు శిరీష్ ప్ర‌స్తుతం త‌న త‌దుప‌రి సినిమాకి సంబంధించిన కార్య‌క్ర‌మాల్లో ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌ణ త్వ‌ర‌లోనే రాబోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version