కరోనా నుండి కోలుకున్న అమిత్ షా

-

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కరోనా నుంచి కోలుకున్నారు. నిజానికి ఆయన ఆదివారం ఉదయమే కరోనా నెగటివ్‌ వచ్చిందని బీజేపీ ఎంపీ మనోజ్‌ తివారీ ట్వీట్‌ చేశారు. వారం రోజుల ట్రీట్‌మెంట్‌ తర్వాత షాకు కరోనా నెగటివ్‌ వచ్చిందని ఆయన పేర్కొన్నారు. కరోనా పాజిటివ్‌ రావడంతో అమిత్‌ షా గురుగ్రామ్‌లోని మెడంటా హాస్పిటల్‌లో చేరి ట్రీట్‌మెంట్‌ తీసుకున్నారు.

amith sha

అయితే తాజాగా తనకు కరోనా నెగటివ్ వచ్చిందని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఈరోజు నా కరోనా టెస్ట్ రిపోర్ట్ నెగటివ్ వచ్చింది, నేను ఆ భగవంతుడిని, నేను త్వరగా కోలుకోవాలని కోరిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇక ఆయనకు కరోనా సోకినా వెంటనే తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని, కాంటాక్ట్‌ అయిన ప్రతి ఒక్కరు సెల్ఫ్‌ ఐసోలేషన్‌లోకి వెళ్లాలని అమిత్‌ షా ట్వీట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version