కాంగ్రెస్ కు ఓటేస్తే కేసీఆర్ కు వేసినట్లే : అమిత్ షా

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా అయినా బీజేపీని గెలిపించడానికి ప్రధాని మోదీ, హోమ్ మిస్టర్ అమిత్ షా,
నిర్మలా సీతారామన్, జేపీ నడ్డా లాంటి అగ్ర నాయకులు ప్రచారంలో తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. ఇక అమిత్ షా ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ కాంగ్రెస్ మరియు BRS లు రెండూ ఒక్కటేనని చౌటుప్పల్ లో తన వాణి వినిపించారు. ఈ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ కు ఓటు వేస్తే అది కేసీఆర్ కు వేసినట్లే అంటూ అమిత్ షా ప్రజలకు అవగాహన కల్పించారు. నవంబర్ 30న ప్రతి ఒక్కరూ బీజేపీకి మాత్రమే మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలి అంటూ అమిత్ షా ప్రజలను కోరారు. తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి వస్తే దేశమంతా గర్విస్తున్నా అయోధ్య రామమందిరంలోకి ఉచిత దర్శనం ను కల్పిస్తామని అమిత్ షా బంపర్ ఆఫర్ ఇచ్చారు.

తెలంగాణ ప్రజలను విడుతల వారీగా అయోధ్యకు తీసుకెళ్లి చూపిస్తామంటూ అమిత్ షా తెలిపారు. మరి మూడు పార్టీల సంగ్రామంలో ఎవరు గెలుస్తారు అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version