విజయవాడ లాయర్లు ప్రయాణిస్తున్న బస్సుకు యాక్సిడెంట్..

-

విజయవాడ బార్ అసోసియేషన్‌కు చెందిన న్యాయవాదులు ప్రయాణిస్తున్న బస్సుకు ఘోర ప్రమాదం సంభవించింది. న్యాయవాదులు అంతా కలిసి రెండు బస్సుల్లో విహారయాత్రకు వెళ్లారు. ఈ క్రమంలో రాజస్థాన్‌లోని అజ్మీర్ వద్ద మంగళవారం తెల్లవారు జామున 3 గంటలకు రెండు బస్సుల్లో ఒక బస్సు ప్రమాదానికి గురైంది.

ఆగి ఉన్న ట్రక్కును న్యాయవాదుల బస్సు ఢీ కొట్టడంతో సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ భార్య జ్యోత్స్న అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రాజేంద్రప్రసాద్ సహా మరో 11 మందికి గాయాలవ్వగా.. వారందరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version