అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్….పాప్ క్వీన్ రిహాన్నా కోసం అంబానీ అంత చెల్లించాడా…!

-

రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. గుజరాత్ లోని జామ్ నగర్ కి దేశ విదేశాల నుంచి వందలాది మంది ప్రముఖులు తరలిరావడంతో గత రాత్రి ప్రీ వెడ్డింగ్ వేడుక సందడిగా మారింది. అతిథులంతా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ ఉత్సాహంగా గడిపారు.

 

ఇక ఈ ప్రీ వెడ్డింగ్ వేడుక లో పాప్ క్వీన్ రిహాన్నా తొలిసారి ఇండియాలో తన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అంతేకాకుండా ఇల్యూజనిస్ట్ డేవిడ్ బ్లెయిన్ ప్రదర్శన కూడా అతిథులను ఆకట్టుకున్నాడు. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై ఆమె పాటలు పాడుతూ స్టెప్పులతో మెస్మరైస్ చేశారు. తన ప్రదర్శనతో అతిథులను మంత్రముగ్ధులను చేశారు. సుమారు 4 గంటలపాటు పర్ఫార్మెన్స్ ఇచ్చారు. రిహాన్నా కోసం అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఫ్యామిలీ రూ.66 కోట్ల నుంచి రూ.74 కోట్ల వరకు చెల్లించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version