రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది – భట్టి విక్రమార్క

-

తెలంగాణలో అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రలో భాగంగా వరంగల్ లో బీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన దాడిలో గాయపడ్డ యూత్ కాంగ్రెస్ నాయకుడు పవన్ సికింద్రాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో నేడు పవన్ ను బట్టి విక్రమార్క పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీ నాయకులపై భౌతిక దాడులకు దిగడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారిందన్నారు.

బిఆర్ఎస్ నాయకుల తీరు చూస్తుంటే అసలు రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా? అన్న అనుమానం కలుగుతుంది అన్నారు. పవన్ పై జరిగిన దాడి బాధాకరమని అన్నారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో కాంగ్రెస్ శ్రేణులపై బిఆర్ఎస్ నాయకులు దాడులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version