మాలీవుడ్ వైపు పరుగులు తీస్తున్న అనసూయ.. అందుకేనా..?

-

బుల్లితెర గ్లామర్ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ అనసూయ గురించి పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ షో ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈమె ఆ తరువాత తన అందచందాలతో యువతను కట్టిపడేసింది. గ్లామర్ షో చేయడంలో ఈమె తర్వాతే ఎవరైనా అనేంతల అందాలు ఒలకబోసిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు యాక్టివ్ గా మారుతూ ఏదో ఒక విషయంపై ట్రోల్స్ కి గురవుతూ ఉంటుంది. అందుకే జబర్దస్త్ లాంటి ఇతర టీవీ షోల ద్వారా ఎంత పాపులారిటీ అయితే దక్కించుకుందో సోషల్ మీడియా వేదికగా కూడా రూమర్స్ ద్వారా అంతే పాపులారిటీ దక్కించుకుంది.

ఇదిలా ఉండగా మరొకవైపు సినిమాలలో అవకాశాల కోసం పూర్తిస్థాయిలో బుల్లితెర షోలను కూడా వదిలేసింది. టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉండగా ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మాలీవుడ్ వైపు పరుగులు తీస్తోందంటూ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అనసూయ మలయాళం సినిమా రీమేక్ లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటూ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.

ఇప్పటివరకు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో ప్రేక్షకులు అలరించిన ఈమె ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించడానికి ఒకే చెప్పింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మళయాళం రీమేక్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అతి త్వరలోనే షూటింగ్ ప్రారంభించబోతున్నామని మేకర్స్ ఆఫ్ ది రికార్డ్ తెలిపారు. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక విషయాలు బయటకు రానున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version