ఏపీ కరోనా అప్డేట్ : కొత్తగా 1433 కేసులు

-

చైనా లో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి ఏపీని వదలేలా లేదు. ఆంధ్ర ప్రదేశ్‌ లో మొన్నటి వరకు పెరిగిన కరోనా కేసులు.. ఇప్పుడు తగ్గు ముఖం పడుతున్నాయి. తాజాగా నిన్నటి కంటే ఈ రోజు కాస్త తగ్గాయి కరోనా కేసులు. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1433 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,94,207 కి పెరిగింది.

ఒక్క రోజు వ్యవధిలో మరో 15 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 13,686 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 15,944 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 1815 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 68,041 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2,58, 35, 650 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 19,64,577 లక్షలకు చేరింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version