అందులో చంద్రబాబుకు 45 ఏళ్ల అనుభవం : సీఎం జగన్

-

వైఎస్సార్ జిల్లా కుటుంబ సభ్యులు ఎప్పుడూ నా వెన్నంటే ఉన్నారని పేర్కొన్నారు సీఎం జగన్. ప్రొద్దుటూరులో సీఎం జగన్ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ 2లక్షల 70వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి.. ఎక్కడ లంచాలు లేకుండా నేరుగా ప్రజల చేతిలో ఉంచిన ప్రజా ప్రభుత్వ ఎజెండా మన జెండా. 2024 ఎన్నికల సమరానికి సిద్ధం అన్నారు. 

ఈ జెండా మరే జెండాతో జత కట్టడంలేదు. ప్రజలే ఎజెండా ఈ జెండా రెపరెపలాడుతుందన్నారు. మే 13న ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేసి మరో వంద మందికి  చెప్పి మనందరి పార్టీని గెలిపించండి. పేదల వ్యతిరేక పార్టీలను ఓడించడానికి మీరంతా సిద్దమేనా అని అడిగారు. గెలుపే లక్ష్యంగా మనందరం అడుగులు వేయాలి. మోసాలు చేసే వాళ్లు, కుట్రలు చేసే కూటమి మనకు ప్రత్యర్థులుగా ఉన్నారు.  ముఖ్యంగా చంద్రబాబుకు 45 ఏళ్ల అనుభవం.. ఎందులో అంటే.. మోసాలు, కుట్రలు, కుతంత్రాలు చేయడం..  మేనిఫెస్టోను చెత్త బుట్టలో వేయడం వంటి వాటిలో  14 సంవత్సరాల అనుభవం ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version