2024లో జరిగే ఎన్నికలు చరిత్రలో నిలవబోతున్నాయి : సీఎం జగన్

-

2024లో జరిగే ఎన్నికలు చరిత్రలో నిలవబోతున్నాయని  సీఎం జగన్ పేర్కొన్నారు. తాజాగా చింతలపాలెం లో నిర్వహించిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో మాట్లాడారు. జన ప్రభంజనానికి ఈ సభ అద్ధం పడుతోంది. ఉత్తరాంధ్రలో రెండు సముద్రాలు కనిపిస్తున్నాయి. పెత్తందారులపై యుద్ధానికి అంతా సిద్ధంగా ఉండాలి. ఈ ఎన్నికల రాబోయే భవిష్యత్ అన్నారు.

మీ బిడ్డ ప్రతీ ఇంటికి మంచి చేశాడు. జగన్ ఓ బచ్చా అన్నాడు చంద్రబాబు. ఉక్రోశం, కడుపు మంటతో మనపై దాడులు చేస్తున్నారు. 75 ఏళ్ల వయస్సులో 10మందిని ఎందుకు పోగు చేసుకోవాల్సి వస్తుందని ప్రశ్నించారు. ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ చుట్టూ ఎంత మంది బాణాలు పట్టుకొని ఉన్నాడో గమనించాలని కోరారు. మీ బిడ్డ ఒక్కడిపై ఇంత మంది బాణాలు, ఆయుదాలు పట్టుకొని ఉన్నారు. వీరందరి మధ్య మీ బిడ్డ ఒక్కడే నిలబడి ఉన్నాడు.. మీ బిడ్డకు తోడు ఎవ్వరూ అని ప్రశ్నించారు. జగన్ కు తోడు.. ఆ దేవుడు, ఈ కోట్ల మంది పేదలు.. ఇంటింట్లో ఉన్న నా అక్కాచెల్లెమ్మలు అని గర్వంగా చెబుతున్నానని పేర్కొన్నారు సీఎం జగన్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version