కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన గుత్తా..!

-

గుత్తా సుఖేందర్‌రెడ్డి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. బీఆర్ఎస్‌ లో సంస్థాగత మార్పులు అవసరం అని గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఓటమి తర్వాత కూడా బీఆర్ఎస్‌లో సరైన సమీక్ష జరగలేదు అని సుఖేందర్‌రెడ్డి అన్నారు. పార్టీ విధానాల్లో మార్పు రాకపోతే తీవ్ర నష్టం ఉంటుంది అని సుఖేందర్‌రెడ్డి అన్నారు. అలానే ఆయన చెప్తూ, నేను పార్టీ మారేది లేదు అని అన్నారు.

అలానే నాకు పదవులు కూడా ఊరికే రాలేదు అని గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 11 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ ఓటమి మీద సమీక్ష లేదని సుఖేందర్ రెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లాలో పార్టీ పరిస్థితిని కేసీఆర్ కి వివరించేందుకు ప్రయత్నించినని అన్నారు. కానీ సాధ్యం కాలేదని అన్నారు. పార్టీ లో గ్రామస్థాయి నుంచి నిర్మాణమే లేదని కమిటీలన్నీ నామ మాత్రమేనని గుత్తా అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version