కరోనా కట్టడి.. మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం

-

ఏపీలో కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఐదుగురు మంత్రులతో  మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కన్వీనర్ గా ఉప సంఘం ఏర్పాటయింది.

హోంమంత్రి మేకతోటి సుచరిత, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మెంబర్లుగా ఉప సంఘం అని చేయనుంది. సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా కట్టడికి పలువురు కీలక అధికారులతో కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కమాండ్ కంట్రోల్ సెంటర్ కు కావలసిన సలహాలు, సూచనలు మంత్రివర్గ ఉప సంఘం చేయనుంది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version