అప్పికొండ బీచ్ లో రాళ్ళ మధ్య చిక్కుకుపోయిన యువతి…!

-

విశాఖ గాజువాకలో కలకలం. అప్పికొండ బీచ్ లో రాళ్ళ మధ్య మచిలీపట్నం కావ్య అనే యువతి చిక్కుకుపోయింది. అపస్మారక స్థితిలో ఉన్న యువతిని గుర్తించిన స్థానిక జాలార్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో భీమవరంకి చెందిన వర్మా రాజు యువకుడి తో కలిసి వచ్చి ప్రమాదానికి గురైనట్టు గుర్తించారు పోలీసులు. ఇక ఇప్పటికే బందరు పీఎస్ లో మిస్సింగ్ కేసు పెట్టారు యువతి తల్లిదండ్రులు. తనతో పాటు వచ్చిన యువకుడు వివరాలు చెప్పేందుకు మొదట నిరాకరించింది యువతి.

A young woman stuck between rocks in Appikonda beach

ఈ నెల 2వ తేదీ నుంచి అప్పికొండ సముద్ర తీరంలో ఉన్న కొండ పై ఉంటున్నారు యువతి, యువకుడు. పగలు విశాఖలో తిరుగుతూ రాత్రి సమయంలో కొండపై నిద్రిస్తున్నారు ఆ యువతీ, యువకుడు. అయితే..రాళ్ల మధ్య ఇరుక్కుపోయిన యువతి కావ్యను డోలి సహాయంతో అతి కష్టం మీద ఒడ్డుకి తీసుకు వచ్చారు జాలర్లు.యువతిని కాపాడే సమయంలో రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్నాడు యువకుడు వర్మా రాజు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు దువ్వాడ పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version