ఫైబర్ నెట్ కేసులో పిటీ వారెంట్ పై విచారణ వాయిదా..!

-

ఫైబర్ నెట్ కేసులో పిటి వారెంట్ పై విజయవాడ ఏసిబి కోర్టులో విచారణ గురువారానికి వాయిదా పడింది. సిఐడి తరపు న్యాయవాది వివేకానంద సుదీర్ఘ వాదనలను ఇవాళ వినిపించారు కేసు వివరాలు ఎందరిని అరెస్టు చేశారని విషయాలను జడ్జికి వివరించారు చంద్రబాబును కోర్టుకు తీసుకురావాలని వాదించారు కొనసాగించేందుకు సమ్మతించిన ఏసీబీ కోర్టు తదుపరి విచారణను గురువారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు వాయిదా వేసింది వాదనల అనంతరం ఏసీబీ కోర్టు నిర్ణయం వెల్లడించనుంది.

ముఖ్యంగా కాల్ డేటా పిటీషన్ పై తమ వాదనలు వినాలని చంద్రబాబు తరపు లాయర్లు కోర్టును కోరారు. దీంతో గురువారం మధ్యాహ్నం వాదనలు వినేందుకు ఏసీబీ కోర్టు అంగీకరించింది. అంతకుముందు v తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు వేసిన రైట్ టు ఆడియన్స్ పిటిషన్ను న్యాయస్థానం డిస్మిస్ చేసింది. హైకోర్టు ఆదేశాలతో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పిటి వారెంట్ పై ఏసీబీ కోర్టులో విచారణ వాయిదా పడింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version