తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..ఇవాళ రథసప్తమి వేడుకలు

-

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అధికారులు కీలక సూచన చేశారు. ఈ రోజు అంటే మంగళవారం రథసప్తమి కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులను సర్వదర్శనంలో అనుమతిస్తామని తెలిపారు. ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహన సేవతో ఈ వేడుకలు ప్రారంభం అయ్యాయి.

Alert to devotees of Tirumala Srivari Rathasaptami celebrations today

ఉదయం 9 గంటల నుంచి 10 వరకు చిన్నశేష వాహన సేవ, 11 నుంచి 12 వరకు గరుడ వాహన సేవ, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహన సేవ ఉండనున్నట్లు తెలిపారు.

  • తిరుమల….ఇవాళ శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు
  • ఉదయం 5:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సప్త వాహనాలు పై భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీవారు
  • ఉదయం 5:30 గంటలకు సూర్యప్రభ వాహనసేవ
  • ఉదయం 9 గంటలకు చిన్నశేష వాహనసేవ
  • ఉదయం 11 గంటలకు గరుడ వాహనసేవ
  • మధ్యాహ్నం 1 గంటకు హనుమంత వాహనసేవ
  • మధ్యాహ్నం 2 గంటలకు చక్రస్నానం
  • సాయంత్రం 4 గంటలకు కల్పవృక్ష వాహన సేవ
  • సాయంత్రం 6 గంటలకు సర్వభూపాల వాహన సేవ
  • రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహన సేవ
  • ఇవాళ శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు,ప్రత్యేక దర్శనాలు,విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు

Read more RELATED
Recommended to you

Exit mobile version