అబద్దాలు చెబితే లోకేష్ లాంటి కొడుకు పుడతాడు – అంబటి రాంబాబు

-

అబద్దాలు చెబితే లోకేష్ లాంటి కొడుకు పుడతాడంటూ అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఫైర్‌ అయ్యారు. 1998 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు చంద్రబాబు ఎందుకు పోలవరం గురించి ఆలోచించ లేదు?? అని మండిపడ్డారు. ప్రాజెక్టుల పై చిత్తశుద్ధి లేని వ్యక్తి అని.. గాలేరు-నగరి ప్రాజెక్టును ఎందుకు పట్టించుకో లేదని మండిపడ్డారు.

అబద్దాలు చెబితే లోకేష్ లాంటి కొడుకు పుడతాడు… చంద్రబాబు మీడియా సమావేశంలో నవరసాలు పండించాడని చురకలు అంటించారు. చంద్రబాబు వంటి గొప్ప నటుడిని ఇంత వరకు నేను చూడలేదని.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి, ఇరిగేషన్ ప్రాజెక్టులకు పట్టిన శని చంద్రబాబు నాయుడు అంటూ రెచ్చిపోయారు. 2020లో వరదల వల్ల డయా ఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని.. డయాఫ్రమ్ వాల్ ను కాఫర్ డ్యామ్ పూర్తి చేసిన తర్వాత కట్టాలన్నారు. కానీ చంద్రబాబు ఎందుకు ప్రణాళిక లేకుండా డయాఫ్రమ్ వాల్ కట్టాడు?? అంటూ ప్రశ్నించారు అంబటి.

Read more RELATED
Recommended to you

Exit mobile version