గుంటూరు నుంచే పోటీలోకి దిగుతా – అంబటి రాయుడు

-

గుంటూరు నుంచే పోటీలోకి దిగుతానని ప్రకటన చేశారు అంబటి రాయుడు. మాజీ క్రికెటర్ తిరుపతి అంబటి రాయుడు సీఎం క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో వైసీపీలోకి చేరారు.ఈ కార్యక్రమంలో ఎంపీ పెద్దిరెడ్డి ,మిథున్‌రెడ్డి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి,పాల్గొన్నారు. అంబటిని హత్తుకున్న జగన్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ambati rayudu joins in ycp

అనంతరం మాట్లాడిన రాయుడు.. రాజకీయాల్లో నా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించా. YCPలో చేరడం సంతోషంగా ఉందని చెప్పారు. మొదటి నుంచి CM జగన్ పై నాకు మంచి అభిప్రాయం ఉంది. కుల, మతాలతో పనిలేకుండా జగన్ రాజకీయాలు చేస్తున్నారు. జగన్ పాలన చాలా పారదర్శకం అని ప్రశంసలు కురిపించారు మాజీ క్రికెటర్ తిరుపతి అంబటి రాయుడు. గుంటూరు ప్రజల కోసం పని చేస్తానని హామీ ఇచ్చారు మాజీ క్రికెటర్ తిరుపతి అంబటి రాయుడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version